calender_icon.png 12 June, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీ కేసును చేధించిన పోలీసులు

11-06-2025 01:23:56 AM

ఇద్దరు నేరస్తుల రిమాండ్: డీఎస్పీ నరేందర్‌గౌడ్

మనోహరాబాద్(తూప్రాన్), జూన్ 10 : వృద్ధ మహిళను మత్తులోకి నెట్టి బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోపిడీ చేసిన జంటను మనోహరబాద్ పోలీసులు అరెస్టు చేసి దొంగిలించిన మొత్తం బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మండలంలోని కొప్పులపల్లికి చెందిన బాదనపురం పెంటయ్య, వట్టూరుకు చెందిన పాంబండ వరలక్ష్మీ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు.

పెంటయ్య ఆన్లైన్  గేమ్లకు బానిసై అప్పుల భారం పెరిగి చెడు అలవాట్ల కారణంగా ఈ నేరానికి పాల్పడగా వరలక్ష్మీ అతనికి పూర్తిగా సహకరించిందని తెలిపారు. పరికిబండ గ్రామ శివారులోని కాత్యాయిని గుడి వద్ద వృద్ధ మహిళ మెడలోంచి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్ళిన తర్వా మంగళవారం ఇద్దరు నిందితులు ఆభరణాలను అమ్మడానికి వెళ్తున్న సమయంలో దండుపల్లి వద్ద విజిబుల్ పోలిసింగ్ లో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

విచారించగా నేరాన్ని అంగీకరించడంతో దొంగిలించిన సొమ్మును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. అతితక్కువ సమయంలో కేసును చేదించిన సిఐ రంగ కృష్ణ, మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్, సిబ్బంది గోవర్ధన్ రావ్, రాధాకృష్ణన్, బిక్షపతిలను జిల్లా ఎస్పీఅభినందించారు.