12-02-2026 02:49:47 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న క్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చ్తన్య చౌరస్తా లో గల పోలింగ్ కేంద్రం వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని చూసిన ఆయన వెంటనే స్పందించి స్వయంగా వీల్ చైర్ ను నెట్టుకుంటూ వెళ్లి సదరు వృద్ధుడు ఓటు వేయడానికి సహకరించారు. మానవయ కోనాన్ని చాటుకున్నారు. ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా సామాన్యుడి పట్ల ఆయన చూపిన ఈ చొరవ అక్కడున్న ఓటర్లను సిబ్బందిని విశేషంగా ఆకట్టుకుంది.