27-06-2025 01:44:21 AM
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 26 (విజయక్రాంతి); అంతర్జాతీ య మాదకద్రవ్యాల,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కొత్త గూడెం రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించా రు. ర్యాలీని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్లో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థు లు, స్థానికులను ఉద్దేశించి సమావేశాన్ని ఏర్పాటుచేసి మాదకద్రవ్యాల వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్,ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాదకద్రవ్యాల వలన కలిగే చెడు పరిణామాలను గుర్తించాలని, గంజాయి, డ్రగ్స్ బారినపడి యువత తమ అమూల్యమైన జీవితాలను కోల్పోతున్నార న్నారు.ఈ అవగాహన కార్యక్రమాలను కేవలం యాంటీ డ్రగ్ డే వారోత్సవాలలో భాగంగా కాకుండా నిత్యం అవగాహన కల్పించేందు కు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు.
మన జిల్లాను మాదకద్రవి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లా గా మార్చడంలో కృషి చేస్తున్న మన జిల్లా పోలీసు శాఖ కృషి అభినందనీయం అని తెలిపారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ర్యాలీకి హాజరైయన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు Say no to drugs & yes to life నినాధంతో ప్రతిజ్ఞ చేస్తూ.. మీ చుట్టూ ప్రక్కల ఉన్న వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అధికారులుగా పనిచేస్తున్న మేము డ్రగ్స్ నకు సంబంధించి ఎలాంటి పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి ఒక సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎక్సైజ్ డిఎస్పీ కరంచంద్,బిల్లా సంక్షేమ అధికారిని లెనినా కుమారి, కొత్తగూడెం ఎఫ్ డి ఓ కోటేశ్వరరావు,కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.