calender_icon.png 27 June, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాచక రహిత నగరానికి స్పెషల్ డ్రైవ్

27-06-2025 01:43:12 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రధాన కూడళ్లలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్ హోమ్‌లకు లేదా సంబంధిత  కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టిం దని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటికే బషీర్‌బాగ్, సెక్రెటరియేట్, నాంపల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద ఉండే యాచకులు, ఫుట్‌పాత్‌లపై ఉండే వారిని గుర్తించి జీహెచ్‌ఎంసీ నిర్వహించే షెల్టర్ హోమ్ లకు తరలిస్తున్నారు.

యుసిడీ విభాగం ఆధ్వర్యంలో చేప ట్టిన ఈ యాచకుల తరలింపులో 221 మం దిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది స్త్రీలు, 11 పిల్లలున్నారు. 19 మందిని జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ కు తరలించగా, మిగిలిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు.