calender_icon.png 27 June, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కిమ్స్ సన్‌షైన్’లో ఆధునిక ఐ కేర్ సెంటర్

27-06-2025 01:44:51 AM

బేగంపేట బ్రాంచీలో ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ బే గంపేట్‌లో ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఐకేర్ సెంటర్‌ను గురువారం ప్రారంభించారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనే జింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి, చీఫ్ ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ భవాని, హె డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అత్తమాలజీ డాక్టర్ ఎస్‌టిఎస్ పృధువ్యాస్ ప్రారంభించారు.

డాక్టర్ ఏవీ గురవరెడ్డి మాట్లాడుతూ.. అన్ని రకాల వైద్య సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే సంకల్పంతోనే ఆధునిక వైద్య సే వలతో కూడిన ఐకేర్ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. కార్నియా క్యాట్రాక్ట్ రెటీనా గ్లూకోమా వంటి విభాగాలకు చెందిన ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయ ని హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అత్తమాలజీ డాక్టర్ ఎస్‌టిఎస్ పృధువ్యాస్ తెలిపారు.

చిన్నపిల్లల్లో ముఖ్యంగా అంధత్వాన్ని అరికట్టేందు కు అవసరమైన ఆధునిక పరికరాలు, వైద్య సదుపా యాలు అందుబాటులో ఉన్నాయ ని, మయోపియా మాస్టర్ అనే ఆధునిక టె క్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. హాస్పిటల్ ఈఓఓ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ.. కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో ఎప్పటి కప్పుడు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వైద్య సేవలు అందిస్తోందన్నారు. సమావేశంలో ఆప్తమాలజిస్టు లు డాక్టర్ జ్యోతి, డాక్టర్ విష్ణు ప్రీతి పాల్గొన్నారు.