మీడియా ముందుకు మల్లోజుల
ముంబై: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు. మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్(Maharashtra CM Devendra Fadnavis) అధికారికంగా ప్రకటించనున్నారు. గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టులు తమను తాము రక్షించుకోవాలంటూ, ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా ఆయన లేఖలు రాశారు. 54 ఆయుధాలతో మల్లోజుల వేణుగోపాల్ రావు మంగళవారం నాడు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు.
మావోయిస్టు సంస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తలలో ఒకరిగా పరిగణించబడే సీనియర్ నక్సల్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao) లొంగిపోవడం మావోయిస్టు భావజాలానికి తీవ్రమైన ఎదురుదెబ్బ అని తెలంగాణ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. తెలంగాణకు చెందిన నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Communist Party of India) కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు అయిన రావు అలియాస్ భూపతి సోమవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 60 మంది ఇతర కార్యకర్తలతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.




