30 August, 2026 | 8:21 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

పూలాజీ బాబా బోధనలు అనుసరించాలి

30-08-2026 07:14 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జైనూర్ మండలంలోని పట్నాపూర్ లో శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా 102వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పూలాజీ బాబా చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గం, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన బోధనలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పూలాజీ బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.