హామీలు నెరవేర్చాలని పోస్టుకార్డు ఉద్యమం

19-04-2024 12:50:00 AM

మంచిర్యాల, ఏప్రిల్ 18(విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ చెన్నూర్ నియోజకవర్గంలోని రైతులు గురువారం పోస్టుకార్డు ఉద్యమానికి తెరలేపారు. అధికారంలోకి రా గానే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతానని చెప్పి ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేద ని, ముఖ్యమంత్రికి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని చెన్నూర్ మండలంలోని కిష్టంపేట రైతులు తెలిపా రు. వరి ధాన్యానికి బోనస్, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, రైతు రుణమా ఫీ తదితర హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే నీరు లేక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా ఎకరాకు రూ. 25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.