17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

'తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలు' పోస్టర్ ఆవిష్కరణ

28-05-2025 08:31 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(Telangana Journalist Forum) రాజతోత్సవ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు.

దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ నెల 31న జలవిహార్ లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు కామారెడ్డి జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణలో టియుడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షులు ఒడ్డెమ్ భాస్కర్, టియుడబ్ల్యూజే, టెంజు అధ్యక్షులు మంత్రి అంజి, దశాగౌడ్, అంజల్ రెడ్డి, రాములు, రామచంద్రం, నాగరాజు, కిషన్, విశాల్, భరత్ గౌడ్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.