17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సేవలు అందించాలి..

28-05-2025 08:25 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): బుధవారం హనుమకొండ జిల్లా మడికొండ శివారులోని దుర్గభాయి మహిళా శిశు వికాస కేంద్రం ప్రాంగణంలో జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య(District Collector P. Pravinya) జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఏదైనా విపత్తులు, ఆపద సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడేలా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వైద్య, ఆరోగ్య, మత్స్య, అగ్నిమాపక శాఖలను భాగస్వామ్యం చేస్తూ ఆ శాఖల అధికారులు సీపీఆర్ చేయడం, అగ్ని ప్రమాదాల నుండి కాపాడడం, వరదలు సంభవించినప్పుడు ఎలా రెస్క్యూ చేస్తారనే వివరాలను తెలియజేస్తారని అన్నారు. వాలంటరీలు తమ చుట్టుపక్కల సంభవించే విపత్తుల భారీ నుండి కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు మాట్లాడుతూ... ఆపద మిత్ర వాలంటీర్లకు 12 రోజుల పాటు ప్రకృతి విపత్తు, ఆపద సమయాలలో ఏవిధంగా కాపాడవచ్చనే వివరాలను శిక్షణ కార్యక్రమం లో తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, మెప్మా కోర్డినేటర్ రజిత రాణి, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ జయశ్రీ, ఆపద మిత్ర వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన..

బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ సమీపంలోని పాత ఆర్ అండ్ బి క్వార్టర్స్ భవన సముదాయం ఆవరణలో ప్రతిపాదిత 33/11 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు ఆర్ అండ్ బి, విద్యుత్, రెవెన్యూ అధికారులతో స్థల విస్తీర్ణం భవన వివరాలను ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబును అడిగి, స్థలానికి సంబంధించిన మ్యాపును హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ మధుసూదన్, డిఈ సాంబరెడ్డి, రెవెన్యూ, విద్యుత్, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.