8 July, 2026 | 8:33 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

ఆప్, బీజేపీ మధ్య పోస్టర్ వార్

03-01-2025 01:47 AM
  • కేజ్రీవాల్‌ను పెద్ద మోసగాడిగా అభివర్ణించిన బీజేపీ

కౌంటర్‌గా గోట్ పోస్టర్ విడుదల చేసిన ఆప్

న్యూఢిల్లీ, జనవరి 2: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బుధవారం ఒకరిపై మరొకరు లేఖాస్త్రాలు సంధించుకుని పరస్పర ఆరోపణలు చేసుకున్న ఆప్, బీజేపీలు.. గురువారం సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేసి విమర్శలు గుప్పించుకున్నాయి. ముందు గా ‘స్కాం 2024’ టైటిల్‌తో కేజ్రీవాల్ ఫొటోతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన బీజేపీ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది.

కేజ్రీవాల్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాకుండా ఆయనను పెద్ద మోసగాడిగా అభివర్ణించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ కొత్త ఆటను ప్రారంభించారని.. ఓట్లను రిగ్గింగ్ చేయడం ద్వారా అధికారాన్ని కాపాడుకునే ప్రతయ్నం చేస్తున్నారని విమర్శించింది. ఒకే ఇంటి చిరునామాపై వందల కొద్దీ నకిలీ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించింది. 

ఆప్ కౌంటర్

కేజ్రీవాల్‌పై పోస్టర్‌ను విడుదల చేసిన కొద్ది సమయానికే బీజేపీకి ఆప్ కౌంటర్ ఇ చ్చింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన జీఓఏటీ(గోట్) పోస్టర్‌కు అరవింద్ కే జ్రీవాల్ ఫొటోను చేర్చి ఆయనను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా అభివర్ణించింది. ఆయన ఫొటో వెనక ఢిల్లీలోని ఆసుపత్రులు, పాఠశాలకు సంబంధించిన చిత్రాలను చేర్చు తూ వీడియోను రూపొందించి దాన్ని సో షల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆసుపత్రులు, పాఠశాలలు మెరుగైనట్టు వీడియో ద్వారా వెల్లడించిం ది.

ఓట్ల కొనుగోలు బీజేపీ పెద్ద మొత్తంలో డబ్బులు పంచుతోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు బుధవా రం రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించా రు. ఆ లేఖపై కౌంటర్ ఇచ్చిన బీజేపీ.. సం ఘ్‌కు లేఖలు రాయడం మానకుని దాని నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని హిత వు పలికింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.