గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం
11-05-2026 09:14 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గిరిజన పాఠశాలలు మరియు విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచడానికి వినూత్న ఆలోచనలు, ఆచరణాత్మక పరిష్కారాలు విజయవంతమైన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ గురు సంకల్పం అనే కార్యక్రమాన్ని ఐటిడిఏ అధికారులతో కలిసి సోమవారం నాడు ఆవిష్కరించారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ప్రతిపాదనలు జూన్ 2 2026 వరకు సమర్పించాలని కోరారు,
ఉత్తమమైన వాటికి నగదు బహుమతులు ప్రకటించారు
1) అతి ఉత్తమమైన వాటికి 5000
2) ఉత్తమమైన వాటికి 4000
3) వినూత్నమైన వాటికి 3000
ఉత్తమమైనవి ఆచరణాత్మకమైన వాటిని వచ్చే విద్యాసంస్థల నుండి అమలు చేస్తామన్నారు.






