16 March, 2026 | 11:06 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పొట్టి శ్రీరాములు 123వ జయంతి

16-03-2025 11:52 AM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు 123వ జయంతి వేడుకలను నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి భూమేష్ గుప్త మాట్లాడుతున్న పొట్టి శ్రీరాములు ఆదర్శమూర్తిగా నిలిచారని ఆయన ఆశయాలను ప్రతి ఆర్యవైశ్య సోదరులు కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ మోటుర్ శ్రీకాంత్ గుప్తా, కౌన్సిలర్ పార్షి కాంశెట్టి, పేపర్ శ్రీనివాస్, ఆర్యవైశ్య యూత్ ఉపాధ్యక్షుడు వలపుశెట్టి భాస్కర్, గరిపల్లి శ్రీధర్, ఆకుల నారాయణ, యాద అంజయ్య, పిప్పిరి శేఖర్, విశ్వం, కుబీ, బొడ్ల వేణు గోపాల్, ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.