పౌల్ట్రీ పరిశ్రమను కాపాడాలి
మిర్యాలగూడ,(విజయక్రాంతి): నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ పరిశ్రమ పౌల్ట్రీ కార్పొరేషన్ కంపెనీ విధానాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ బుధవారం పట్టణంలోని చికెన్ షాప్ ల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్స్ ఓనర్స్ అండ్ ట్రేడర్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రాంబాబుల ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం బైక్ ర్యాలీ నిర్వహించి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణన్ అమిత్ మాలెంపాటికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ కార్పొరేషన్ విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేలపోలు శ్రీనివాస్, రియాజ్ భాయ్,తిరుమలరావు, షఫీ, శ్రీధర్,శ్యామ్ తదితరులున్నారు.




