07-11-2025 06:20:10 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆదివారం విద్యుత్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆపరేషన్ డిఇ నాగరాజు తెలిపారు. 33/11 కెవి ఆదర్శనగర్ సబ్స్టేషన్ పరిధిలో వేసవికాలంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయుటకు నిర్మించనున్నటువంటి 33 కెవి టవర్ లైన్ పనుల దృష్ట్యా ఆదర్శనగర్, ఈద్గాం, గాయత్రి పురం, సిద్దాపూర్, రాంనగర్, భాగ్యనగర్ మదీనా కాలనీ, మౌలానా ఆజాద్ నగర్, ఇరిగేషన్ ఆఫీస్, వెటర్నరీ హాస్పిటల్, సోఫీ నగర్, మహమ్మదీయ మజీద్, విద్యానగర్, మంచిర్యాల్ క్రాస్ రోడ్ ఏరియాలో సరఫరా నిలిచిపోతుందన్నారు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడును కావున వినియోగదారులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.