11-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరయ్యారు. సంబంధిత న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో ఆయన హాజరు నమోదు కాకుండానే తిరిగి వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ హయాంలో విపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, న్యాయమూర్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన ఆరోపణలతో 2024 మార్చిలో కేసు నమోదైంది. కేసు నమోదైన వెంటనే ప్రభాకర్రావు అమెరికాకు పారిపోయారని, విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆయన్ను ‘ప్రకటిత నేరస్థుడు’గా ప్రకటించాలని నాంపల్లి కోర్టును కోరగా, ఈ నెల 20వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్రావు సోమవారం బం జారాహిల్స్లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన విచారణలో సిట్ అధికారులు పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. మంగళవారం నాం పల్లి కోర్టుకు హాజరైన ప్రభాకర్ రావు, న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో కొద్దిసే పు వేచి చూసి వెనుదిరిగారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఉత్కంఠ నెలకొంది. ఆయన తదుపరి ఎప్పుడు కోర్టుకు హాజరవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రభాకర్రావు ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలక మలుపునకు దారితీస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ, పోలీసు వర్గాలు అంచనా.
ఈ కేసులో ఇప్పటివరకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీ ప్రణీత్రావు, అడిషనల్ ఎస్పీ లు తిరుపతన్న, భుజంగ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్రావు సహా ఆరుగురిని నిందితులుగా పోలీ సులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్రావుకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ లభించినప్పటికీ, ఆయన విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.