ప్రశాంతంగా ప్రజాపాలన గ్రామసభలు
02-04-2026 01:09 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ ఫలాలపై చర్చావేదిక ఏర్పాటు చేసి, గ్రామంలోని మౌలిక సదుపాయాలు కల్పనకు గ్రామసభ ద్వారా తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు నాయకులు అధికారులు పాల్గొన్నారు.




