22 June, 2026 | 3:34 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

ప్రాణహితను పక్కనెందుకు పెట్టారు?

15-06-2024 12:54 AM

భారీ ఖర్చుతో కాళేశ్వరం ఎందుకు కట్టారు?

  1. మూడు నెలల వరద కోసం వేలకోట్ల ఖర్చు అవసరమా?
  2. గ్రావిటీ ప్రాజెక్టును వదిలి ఎత్తిపోతల కాళేశ్వరం దేనికి?
  3. ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ గ్రావిటీ వద్దకే తేవటం ఎందుకు?
  4. నీటిపారుదల ఇంజినీర్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నలు

* అసలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఏయే అంశాల్లో ఆ ప్రాజెక్టు వయబుల్ కాదని నిర్ధారణకు వచ్చారు? అందుకు ఏయే నివేదికలను పరిశీలించారు? 

 జస్టిస్ పీసీ ఘోష్

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): గోదావరిలో మూడు నెలల పాటు వచ్చే వరదను ఎత్తిపోయడానికి వేలకోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకంటే ముందే ప్రణాళికలు వేసిన ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని నిలదీసింది.

గ్రావిటీ ఉన్న దగ్గర ప్రాజెక్టును నిర్మించకుండా వేరే చోట భారీగా నిర్మించి.. మళ్లీ గ్రావిటీ ఉన్న దగ్గరికి నీటిని ఎందుకు ఎత్తిపోయాల్సి వచ్చింది? ఇందులో ఆంతర్యం ఏమిటి? ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్, ఓ అండ్ ఎం) కార్యాలయాలకు సంబంధించిన ఇంజినీర్లను శుక్రవారం ప్రశ్నించింది. ఇద్దరు ఈఎన్సీ కార్యాలయాల్లోని ఇద్దరు ఇంజినీర్లను కమిషన్ పలు వివరాలు అడిగి తెలుసుకొన్నది. 

అసలు ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఏయే అంశాల్లో ఆ ప్రాజెక్టు వయబుల్ కాదని నిర్ధారణకు వచ్చారు? అందుకు ఏయే నివేదికలను పరిశీలించారు? అనే కోణంలో ప్రశ్నలను సంధించి సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తున్నది. అనంతరం మీడియాతో మాట్లాడిన పీసీ ఘోష్.. ప్రాణహిత ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించారనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

ప్రాణహిత ప్రాజెక్టుపై గతంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక గురించి కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించినట్టు సమాచారం. రిటైర్డు ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 2015లో ప్రాణహిత రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను తమకు అందించాలని కమిషన్ ఆదేశించింది. కాగా, జూలై మొదటి వారంలో కమిషన్‌కు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), పుణె సంస్థల నుంచి నివేదికలు అందే అవకాశం ఉంది. ఆ నివేది కలు అందిన తరువాత కమిషన్ విచారణలో మరింత వేగం పెరగనున్నది.