7 March, 2026 | 4:40 PM

Breaking News

పేదల ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం   •   108 అంబులెన్స్ లో అర్ధరాత్రి ఆడపిల్ల జననం   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ నేనావతి   •   ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •  

గర్భవతిని మూడు నెలలలోపే గుర్తించాలి

18-06-2025 07:15 PM

డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మాతా శిశు సంరక్షణ సేవలలో భాగంగా ప్రతి గర్భవతిని మూడు నెలలలోపే గుర్తించి వారికి సరియైన సేవలు సూచనలు చేయాలని డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్(DMHO Putla Srinivas) సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, ఎమ్.ఎల్.హెచ్.పి. లకు, సూపర్వైజర్లకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజలకు నీటి ద్వారా, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచాలని సూచించారు.

ఈ నెలాఖరులోపు కచ్చితంగా నూటికి నూరు శాతం సేవలు అందించాలని జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. కనగల్, పెద్దవూర, పీ.ఎచ్.సి. లలో మంచిగా సేవలందించినందుకు వైద్యాధికారులను మెచ్చుకున్నారు. ఈనెల 21 నాడు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా  ప్రతి సబ్ సెంటర్లో ఆరోగ్య కేంద్రాలలో ఉదయం ఏడున్నర వరకు యోగ డే నిర్వహించాలని సూచించారు. ఇందులో ప్రజలను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం వహించేటట్టు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రవి , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ అరుంధతి , డాక్టర్ కృష్ణ కుమారి,  డాక్టర్ తిరుపతి రావు, డెమో  విష్ణు, డిపిఓ వైద్యాధికారులు సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.