24 August, 2026 | 10:43 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి   •   ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •  

గర్భవతిని మూడు నెలలలోపే గుర్తించాలి

18-06-2025 07:15 PM

డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మాతా శిశు సంరక్షణ సేవలలో భాగంగా ప్రతి గర్భవతిని మూడు నెలలలోపే గుర్తించి వారికి సరియైన సేవలు సూచనలు చేయాలని డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్(DMHO Putla Srinivas) సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, ఎమ్.ఎల్.హెచ్.పి. లకు, సూపర్వైజర్లకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజలకు నీటి ద్వారా, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచాలని సూచించారు.

ఈ నెలాఖరులోపు కచ్చితంగా నూటికి నూరు శాతం సేవలు అందించాలని జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. కనగల్, పెద్దవూర, పీ.ఎచ్.సి. లలో మంచిగా సేవలందించినందుకు వైద్యాధికారులను మెచ్చుకున్నారు. ఈనెల 21 నాడు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా  ప్రతి సబ్ సెంటర్లో ఆరోగ్య కేంద్రాలలో ఉదయం ఏడున్నర వరకు యోగ డే నిర్వహించాలని సూచించారు. ఇందులో ప్రజలను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం వహించేటట్టు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రవి , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ అరుంధతి , డాక్టర్ కృష్ణ కుమారి,  డాక్టర్ తిరుపతి రావు, డెమో  విష్ణు, డిపిఓ వైద్యాధికారులు సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.