calender_icon.png 18 June, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు బాగుచేయాలని ధర్నా

18-06-2025 07:11:42 PM

కరీంనగర్ (విజయక్రాంతి): మానకొండూర్ నియోజకవర్గం(Manakondur Constituencyబెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామంలో రోడ్డు బాగుచేయాలని గ్రామస్తులతో కలిసి మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీందర్ రెడ్డి(Former MPP Chintapalli Ravinder Reddy) తాజా మాజీ సర్పంచ్ చింతలపల్లి సంజీవ రెడ్డి, గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... మండల కేంద్రం నుండి బేగంపేట వరకు రోడ్డు బాగుచేయాలని నరకప్రాయంగా కంకర తేలి, దుమ్ము ధూళితో గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, కొద్ది నెలలుగా కంకర పోసి వదిలేయటం వలన ఇప్పటికీ చాలా మంది మోటార్ సైకిల్ పై పడి గాయాలయ్యాయి.

సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో గ్రామస్తులు ఎల శేఖర్ బాబు, నరేష్, మోహన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, సంపత్, రవి, వెంకట్, మల్లయ్య, కనకయ్య, మధు, కనకయ్య, చంద్రం, లింగయ్య, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.