18-06-2025 07:24:20 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు(Bhu Bharathi Revenue Conference)ను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల అధికారులు గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో రైతులకు ఏర్పడ్డ పలు సమస్యలను దరఖాస్తు రూపంలో స్వీకరించడం జరిగిందన్నారు. సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏర్పడ్డ సమస్యలను సరిచేస్తామని అధికారులు వ్యవసాయదారులకు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందులో మండల ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్ఐ, మండల సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు జింక మల్లేశం, జింక చంద్రం, మాజీ సర్పంచ్ కత్తుల సత్యనారాయణ, బోయిని కుమార్, సిహెచ్ రాజు, రవి నాయక్, గోపాల్, నరేష్, బి నరసింగరావు, బి శ్రీకాంత్, గ్రామస్తులు ఉన్నారు.