8 June, 2026 | 7:56 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధం

06-08-2024 04:45 AM

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

యాదాద్రి భువనగిరి,ఆగస్టు5(విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గానికి గోదా వరి జలాలు అందించడానికి ప్రతిపాదిత గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవా రం తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువును సందర్శించిన అనంతరం మండల పరిషత్త్ కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు.

వారు మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని అందించడానికి గంధమల్ల రిజర్వాయర్‌ను 1.48 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనున్నట్టుగా ప్రకటించారు. ఇందుకు రూ.520 కోట్ల వ్యయమైతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేసి నట్టుగా పేర్కొన్నారు. తక్కువ భూసేకరణ తో ప్రజలకు నష్టం లేకుండా రైతులకు మే లు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్య అన్నా రు. సమావేశంలో కలెక్టర్ హనుమంతు జండగే, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) షాలోమ్ బెన్షా, ఆర్డీవో అమరేందర్, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, డీఈఈ రఘు నాధ్ తదితరులు పాల్గొన్నారు.