18-06-2025 06:36:25 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ఎన్ అపర్ణ(Congress Party Vice President N Aparna) ప్రధాన కార్యదర్శి శోభ(General Secretary Shobha) అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో మహిళా కాంగ్రెస్ జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు దుర్గాభవాని అధ్యక్షతన నిర్వహించారు. మహిళల కోసం తమ ప్రభుత్వం ఐదు లక్షలకు ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం తక్కువ వడ్డీకి రుణాలు, 500 కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందిస్తుందని తెలిపారు. అనంతరం జిల్లాలో మహిళా మండల కమిటీలను ఏర్పాటు చేసి వారికి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.