14-09-2025 02:09:57 PM
చిట్యాల (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం అందజేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ఇరువురు అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా వారికీ తెలంగాణ ప్రభుత్వం, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukender Reddy), నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను గుత్తా నర్సింహ రెడ్డి లక్ష రూపాయలు, సుంకరి నర్సింహ 60 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, పాకాల దినేష్, కురుపటి లింగయ్య,మర్రిరమేష్, మేడబోయున శ్రీను, బోయ స్వామి, ఎలిమినేటి హరిప్రసాద్, అనంతుల శంకర్, మందుగుల కుమార్, బోయ లక్ష్మయ్య, గంగాపురo వెంకన్న, బోయ రాములు, మర్రిసత్తయ్య, కంబాలపల్లి లింగస్వామి, జనపాల నర్సింహ, అంతటి నాగరాజు, మాదగోని వెంకన్న, మాదగోని మహేష్,బొడ్డు యాదయ్య, వసుకుల శంకర్, పాకాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.