23 May, 2026 | 7:24 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలి..

14-09-2025 02:11 PM

గార్ల/మహబూబాబాద్ (విజయక్రాంతి): యూరియా సరఫరా కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్(District SP Sudhir Ramnath Kekan) అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల పరిధిలోని ముల్కనూర్ రైతు వేదికలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గత సంవత్సరంలో సాగు, ఈ ఏడాది సాగును అంచన వేసుకొని దానికనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా తెప్పించుకోవాలని అన్నారు. ఇప్పటిదాకా ఎంత యూరియా అందింది,ఇంకా ఎంత అవసరం అవుతుందని రైతులను అడిగి తెలుసుకున్నారు.

గోదాంలో ఉన్న ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, గార్ల, బయ్యారం సిఐ రవికుమార్, ఉపేందర్,ఎస్సై రియాజ్ పాషా, ఏఈఓ మేఘన, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.