19-11-2025 12:46:13 AM
దేవరకొండ, నవంబర్ 18 : దేవరకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్, షాది ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను మంగళ వారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మొత్తం 250 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 1 కోటి 18 లక్షల చెక్కులు, అలాగే షాది ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి పథకాల కింద రూ. 75 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాల ప్రయోజ నాలు నిర్బంధంగా చేరాలనే దృష్టితో ప్రజల కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని తెలిపారు. ఎంఆర్వోలు హనుమంతు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, జయశ్రీ, హర్షద్ మహమూద్, ప్రశాంత్, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.