17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆసుపత్రిలో హెచ్‌ఈఓ, ఆయా తప్ప అందరూ గైర్హాజరే..

19-11-2025 12:47 AM

అహ్మదీపూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా అతనికి చేసిన కలెక్టర్ 

గజ్వేల్, నవంబర్ 18 : గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ఈఓ, ఆయా తప్ప అందరూ గైహాజరయ్యారు. మంగళవారం గజ్వేల్ మండలంలోని అ హ్మదీపూర్ పిహెచ్ సి ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.

సమయం ఉదయం 9.34 గంటలు అయిన కూడా ఎచ్ ఈ ఓ సత్యనారాయణ రెడ్డి, ఆయమ్మ తప్ప మెడికల్ ఆఫీసర్ తో సహా మిగిలిన సిబ్బంది అందరూ గైర్హాజరు కావడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి గైర్హాజరు అయిన వారి వివరాలను నమోదు చేసి ఒక రోజు జీతం కోత విధించాలని, సమయానికి రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డి ఎం అండ్ ఎచ్ ఓ నీ ఫోన్ ద్వారా ఆదేశించారు.