26 February, 2026 | 1:34 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

18-10-2025 05:52 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పి. సుందరయ్య నగర్ లో వ్యాధి నిరోధక టీకా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు షెడ్యూల్ ప్రకారంగా ఇవ్వాలని అన్నారు. తల్లిదండ్రులు విధిగా పిల్లలకు టీకాలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బందితో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల  నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు.