07-06-2025 08:49:51 PM
బడి బాట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ధాశిరాం..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): తల్లిదండ్రులు, తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల లింగారెడ్డిపేట ప్రధానోపాధ్యాయులు, ధాశీరాం అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని, 11వార్డ్ లోని పలు విధుల్లో పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడి బాట కార్యక్రమం నిర్వహించారు. బడి బాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్య, ముందంజలో ఉందని పేర్కొన్నారు. బడిబాటలో భాగంగా, బడీడు పిల్లలను గుర్తించి, తమ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థుల భవిష్యత్కు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజన వసతులను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.