31-05-2025 05:02:20 PM
కేంద్రమంత్రి బండి సంజయ్..
కరీంనగర్ (విజయక్రాంతి): పేదప్రజల ప్రయోజనాలు.. అభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ప్రభుత్వం ఎంపి ల్యాడ్స్ నిధులను కేటాయిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం రోజు ఎంపి ల్యాడ్స్ నిధుల నుండి కొనుగోలు చేసిన సిమెంట్ బ్రేకర్స్ (డ్రిల్లింగ్ మిషన్స్) యంత్రాలను కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్, మాజీ మేయర్లు యాదగిరి సునీల్ రావు, డి. శంకర్, మాజీ కార్పోరేటర్లతో కలిసి మంత్రి తన చేతుల మీదుగా వారి జీవనోపాధి నిమిత్తం 13 మంది వడ్డెర కుటుంబాలకు పంపిణీ చేశారు.
అనంతరం నగరపాలక సంస్థ లో స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరు పై స్థానిక అధికార సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరో వైపు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంను సందర్శించి పరిశీలించారు. సమావేశం మందిరం నిర్మాణం చేసిన తీరు పై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.... నరేంద్ర మోడి ప్రభుత్వం కేటాయిస్తున్న ఎంపి ల్యాడ్స్ నిధులను నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా పేద ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే కరీంనగర్ నగరంలో గతంలో అగ్ని ప్రమాదం వల్ల ఒడ్డెర బస్తీ పూర్తిగా దగ్దం చెంది అందులో వారి డ్రిల్లింగ్ మిషన్స్ పనిముట్లు కాలిపోయి ఉపాధి కోల్పోయిన 13 ఒడ్డెర కుటుంబాలకు ఎంపి ల్యాడ్స్ నిధుల ద్వారానే మల్లి డ్రిల్లింగ్ మిషన్స్ పనిముట్లను కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా ఘోరమని... అనాడు ఒడ్డెర కులస్థుల గుడిసెలు పూర్తిగా దగ్ధం చెందాయని గుర్తు చేశారు. గుడిసెల్లో ఎవరు లేకపోవడంతో ఆనాడు ప్రాణ నష్టం తప్పిందని అన్నారు. అగ్ని ప్రమాదం లో గుడిసెలు దగ్ధం చెందిన 13 మంది కుటుంబాలకు ఆనాడే వారి జీవనం కోసం కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి వారిని ఆదుకోవడం జరగిందని తెలిపారు.
కష్టం చేస్కునే జీవనం సాగించే ఒడ్డెర కులస్థుల డ్రిల్లింగ్ మిషన్స్ పనిముట్లు కాలిపోవడంతో వారి కోరిక ప్రకారం వాటిని నగరపాలక సంస్థ ఎంపి ల్యాడ్స్ నిధుల ద్వారా కొనుగోలు చేసి అందిస్తున్నామని తెలిపారు. వివిధ కారణాల వల్ల వాటి పంపిణీ కొంత ఆలస్యం అయిందని తెలిపారు. గత పాలకవర్గంలో అప్పటి మేయర్ యాదగిరి సునీల్ రావు అభ్యర్థన మేరకు కరీంనగర్ కార్పోరేషన్ అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసిన నిధులతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్ ఎన్నో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. అమృత్ పథకంలో నగర ప్రజల కోసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. అంతే కాకుండా స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ లో కేంద్ర ప్రభుత్వం నిధులనతో పలు ప్రాజెక్టుల అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సుంధరంగా మార్చామన్నారు.
కరీంనగర్ నగరం సుంధరంగా కనబడటానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించిన స్మార్ట్ సిటీ నిధులే కారణం అన్నారు. నగరపాలక సంస్థ పరిదిలోని స్టేడియం, పార్కులు, రోడ్లు, డ్రైనేజీ లు, మంచి నీటి పైపు లైన్లు, మార్కెట్లు, ఇలా అన్ని రకాల అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడ కార్పోరేషన్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర నుండి ఎలాంటి నిధులు తీసుకచ్చే అవకాశం ఉన్న తెచ్చి కరీంనగర్ నగరాన్ని పార్లమెంట్ నియోజకవర్గం ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈఎస్ఐ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడంతో పాటు లా కళాశాలను తీస్కవచ్చామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండే శాతవాహన యూనివర్సిటీలో లా క్లాసులను ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు.
లా కళాశాల ప్రారంభం కోసం ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అనుమతులు తీస్కవచ్చమని గుర్తు చేశారు. మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, వైస్ చాన్సలర్ తో కలిసి డిల్లీలో న్యాయ శాఖ మంత్రి గారిని కలిసి లా కళాశాల ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. మా కోరిక ప్రకారం వారం రోజుల్లోనే కరీంనగర్ శాతావాహాన యూనివర్సిటీ కి కేంద్ర ప్రభుత్వం లా కళాశాలను మంజూరు చేసి... తరగతుల నిర్వహణ కోసం ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అంతే కాకుండా సీఎస్ఆర్ నిధులను కేంద్ర ప్రభుత్వం 5 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. సంబంధిత నిధులతో వేములవాడ,హుస్నాబాద్, జమ్మికుంట, హుజూరాబాద్ హాస్పిటల్స్ ను అధునీకరిస్తున్నట్లు తెలిపారు.
ఒక్క హాస్పిటల్ కు కోటి రూపాయల పై చిలుకు నిధులు కేటాయించి... అధునాతన వసతుసు కల్పించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత ప్రాంతాల పేద ప్రజలు కరీంనగర్ సిటికి రాకుండ స్థానికంగా కావల్సిన వైద్యం అందేలా హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా, నగరం అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పని చేస్తానని తెలిపారు. కరీంనగర్ కార్పోరేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాకారంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ డ్రిల్లింగ్ మిషన్స్ పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ.... పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఒక మంచి సమాజీక సేవా కార్యక్రమం చేసేందుకు మంత్రి వర్యులు రావడం చాలా సంతోషం అన్నారు. కరీంనగర్ నగరంలో గతంలో గుడిసెలు అగ్ని ప్రమాదంలో దగ్ధం చెంది... పనిముట్లు కాలిపోయి ఉపాధి కోల్పోయిన ఒడ్డెర కులస్థుకు ఎంపి ల్యాడ్స్ నిధుల నుండి నగరపాలక సంస్థ ద్వారా డ్రిల్లింగ్ మిషన్స్ యంత్రాలను మంత్రి బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 13 మంది ఒడ్డెర కుటుంబాలకు యంత్రాలను పంపిణీ చేసి జీవనోపాధి కల్పించినట్లు తెలిపారు. మరో వైపు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... గత సంవత్సరం అగ్ని ప్రమాదంలో 13 ఒడ్డెర కుటుంబాలు సర్వస్వం కొల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వారికి అండగా నిలిచారని తెలిపారు.
గుడిసెలు అన్ని కాలిపోయి దుస్తులు, పనిముట్లు దగ్ధం అవడం జరగిందని... ఆ సమయంలో వారి కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించి... జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం చేయడం జరగిందని తెలిపారు. రోజు పని చేస్కోని జీవితం గడిపే వారి డ్రిల్లింగ్ మిషన్స్ పనిముట్లు కూడ కాలి పోయి ఉపాధి కోల్పోయిన సమయంలో వారికి మల్లి డ్రిల్లింగ్ మిషన్స్ పనిముట్లు ఎంపి ల్యాడ్స్ నిధుల నుండి కొనుగోలు చేసి సంజయ్ కుమార్ అందించడం చాలా సంతోషం అన్నారు. పేద ప్రజలను ఆదుకునే చక్కటి కార్యక్రమం లో నాకు అవకాశం కల్పించిన బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. గత మా పాలకవర్గం ఆయాంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నగరంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ లో పలు ప్రాజెక్టుల ద్వారా నగర రూపురేఖలు మార్చామన్నారు. ఎంపి బండి సంజయ్ కుమార్ సహాకారంతో కేంద్ర ప్రభుత్వం నుండి స్మార్ట్ సిటీ నిధుల విడుదల కావడంతో కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు నగరపాలక సంస్థ కు ఇతర నిధులకు సహకారం అందించి కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కి కృషి చేసిన మంత్రి బండి సంజయ్ కుమార్ కు నగర ప్రజల పక్షాణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్లు యాదగిరి సునీల్ రావు, డి. శంకర్, మాజీ కార్పోరేటర్లు, డీఈ లచ్చిరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.