1 July, 2026 | 7:35 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •  

జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్

10-03-2026 02:52 AM

శేరిలింగంపల్లి, మార్చి 9 (విజయక్రాంతి): స్కూల్‌లో చదివే విద్యార్థులు ఎవరైనా జుట్టు పెంచుకుంటే తీసుకోమని హెచ్చరిస్తారు. లేదంటే తల్లదండ్రుల్ని పిలిచి మందలిస్తారు. ఓ ప్రైవేట్ స్కూల్‌లో జుట్టు ఎక్కువగా ఉన్నదని బాధ్యత గల ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఏకంగా గుండు కొట్టించిన సంఘటన హాఫిజ్‌పేట్‌లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ్‌నగర్ బీ-బ్లాక్‌లోని ఓ స్కూల్‌లో ఈశ్వర్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందన్న సాకుతో, అతనికి బలవంతంగా గుండు చేయించడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమ కుటుంబ ఆచారం ప్రకారం లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కు ఉందని అందుకే జుట్టు కత్తిరించుకోలేనని ఆ విద్యార్థి ప్రిన్సిపాల్‌కు వివరించినప్పటికీ.. వినకుండా విద్యార్థి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రిన్సిపాల్ బలవంతంగా గుండు చేయించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.