calender_icon.png 13 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపై ప్రైవేట్ వల..!

13-05-2025 12:00:00 AM

- ప్రవేశాల కోసం ప్రచారం షురూ

- ఉపాధ్యాయులకు టార్గెట్లు

- ఇంటింటికి తిరుగుతున్న ప్రైవేట్ టీచర్లు

- తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మీషన్లు

 -పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

సంగారెడ్డి, మే 12(విజయక్రాంతి): ఉదయం 8 గంటలు.. సంగారెడ్డి పట్టణంలోని ఓ కాలనీలోకి ప్రైవేట్ పాఠశాల బస్సు వచ్చి ఆగింది. అందులో నుంచి విద్యార్థులకు బదులు టీచర్లు దిగారు. వారి చేతుల్లో కరపత్రాలున్నాయి. ఇంటింటికి తిరుగుతూ ’మీ ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నారు.. ఏం చదువుతున్నారు... మా పాఠశాలలో చేర్చించండి.. మంచి బోధన ఉంటుంది...  ఫీజులో రాయితీ కల్పిస్తాం.. స్కూల్ బస్ ఉందంటూ తల్లిదండ్రులకు చెప్పుకుంటూ వెళ్తున్నారు.

అందులో ఒక టీచర్ పిల్లల వివరాలు నోట్ బుక్కులో నమోదు చేసుకుంటూ కనిపించా రు. ఇలా ఒక్క సంగారెడ్డి పట్టణంలోనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రైవేట్ యాజమాన్యాలు ప్రవేశాల కోసం ప్రచారం చేపడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తల్లిదండ్రులను మభ్యపెడుతూ తమ బడిలో చేర్పిం చాలంటూ ప్రచారం షురూ చేశారు.

గతనెల 24 నుంచి వేసవి సెలవులు మొదలయ్యా యి. అప్పటి నుంచే ప్రైవేట్ యాజమాన్యా లు ఎన్నికల ప్రచారం తలపించేలా తమ ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పుతున్నా రు. కరపత్రాలు పంచుతూ ఇప్పుడు అడ్మిషన్ చేయిస్తే రాయితీ ఇస్తామని చెబుతు న్నారు. కొన్ని యాజమాన్యాలు ఫ్రీ అడ్మీషన్ అంటూ బుట్టలో వేసుకుంటున్నారు. ఈ మేరకు టీచర్లకు టార్గెట్లు ఇచ్చారు.

ప్రతీ ఉ పాధ్యాయుడు కనీసం 10 నుంచి 20 మందిని చేర్పించాలని ఆదేశించారు. లేకుం టే వి ధుల నుంచి తొలగిస్తామని హె చ్చరించడంతో వారు నానాతంటాలు పడుతున్నారు. ఉదయం 7 గం టలకే విద్యార్థుల ఇళ్ల ముందు వాలుతున్నా రు. తమ పాఠశాలలో బోధన బాగుంటుం ది..మంచి ఫలితాలు సాధి స్తున్నామంటూ తల్లిదండ్రులకు ఎర వేస్తున్నారు. అయితే ప్ర భుత్వం బడిబాట నిర్వహించే సరికే పిల్లలు ప్రైవేట్లో చేరే అవకాశాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. 

వ్యాపారంగా మలుచుకొని.. 

ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలలు మండలానికి ఒకటి.. రెండో ఉండేవి. ప్రస్తుతం ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మలిచారు. కనీస సౌకర్యాలు లేకపోయినా అధిక పీజులతో తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నా రు. ఎల్కేజీ మొదలు పదో తరగతి వరకు డొనేషన్లు, ఫీజులు, పుస్తకాలు, నోట్ బుక్స్, ప్రాజెక్టులు, బస్సు ఫీజులు వంటి తదితర ఖర్చులతో మోత మోగిస్తున్నారు.

విద్యార్థులను ర్యాంకుల పేరుతో బట్టీ పట్టించి.. తరగతికో రేటు కట్టి చదువును అమ్మకపు సరుకుగా మారుస్తున్న విద్యా సంస్థ లపై విద్యాశాఖ అధికారులు సై తం దృష్టి సారించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ తమ పరిధిలో లేదంటూ విద్యాశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. 

నిబంధనలకు తూట్లు.. 

ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1 అమలు కావడం లేదు. తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. నిబంధనల ప్రకారం పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవా ల్సి ఉంటుంది. చాలా పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు లేవు.

ఇరుకు గదుల్లో, చు ట్టూ వాహనం తిరిగే స్థలం లేని భవనాల్లో స్కూళ్లను ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారిచే విద్యాబోధన చేయించాల్సి ఉండగా, విద్యార్హత లేని వారితో చదువులు కొనసాగిస్తున్నారు.. ఫీజు ల వివరాలు బోర్డుపై ప్రదర్శించాల్సి ఉండ గా, ఏ పాఠశాలలో కూడా అలా జరగడం లే దు. చాలా ప్రైవేట్ పాఠశాలలు ఇలా నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

ప్రచారం షురూ.. 

జిల్లా కేంద్రాలతో పాటు ఆయా మండలాల్లో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల ప్రచారం ఊపందుకుంది. ఎండలు దంచికొడుతున్నా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. తమ పాఠశాలలో చేర్పిస్తే ఫీజులో రాయితీ కల్పిస్తాం.. బస్సు సౌకర్యం వంటి తదితర మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. అందులో చేరాక ఫీజులు పూర్తిస్థాయిలో ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతే డాది ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి సుమారుగా 5వేల మంది విద్యార్థులు ప్రైవేట్లో చేరినట్లు సమాచారం. 

సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య...

సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన అందుతుంది. అర్హత గల ఉపాధ్యాయులతో పాటు వసతులు పూర్తిస్థాయిలో అందుబాబులో ఉంటాయి. మధ్యాహ్నభోజనం, ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈసారి పదవ తరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 2వ స్థానం పొందింది. గుణాత్మకమైన విద్యతో పాటు ఏఐ లాంటి కోర్సులను అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు.

వేంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి