5 June, 2026 | 1:10 AM

రాజేంద్రనగర్ ఆర్డీఓకు ప్రమోషన్

05-06-2026 12:01 AM

అడిషనల్ కలెక్టర్‌గా పెద్దపల్లి జిల్లాకు బదిలీ

రాజేంద్రనగర్, జూన్ 4 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డిఓ) వెంకట్ రెడ్డికి పదోన్నతి  లభించింది . డిప్యూటీ కలెక్టర్ హోదాలో రాజేంద్రనగర్ ఆర్డిఓ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి కి ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్  (రెవిన్యూ) గా నియమిస్తూ రాజేంద్ర నగర్ నుండిబదిలీ చేసింది . స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అదనపు  కలెక్టర్ గా వెంకటరెడ్డి పదోన్నతి లభించడంపై హర్షం వ్యక్తం చేశారు