బీజేపీ పాలనలో సుభిక్షం

02-05-2024 12:40:12 AM

ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్

ఆసిఫాబాద్‌లో ఇంటింటి ప్రచారం

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 1 (విజయక్రాంతి): బీజేపీ పాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కమ లం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ప్రజలను విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి నగేశ్ బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎస్‌పీఎం క్రీడా మైదానంలో వాకర్స్‌తో మాట్లాడారు. సిర్పూర్(టీ) మండలంలోని టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, కోశాధికారి అరుణ్ లోయ, సిందం శ్రీనివాస్, గజ్జల లక్ష్మణ్, రమేష్, అశోక్, విజయ్ సింగ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.