calender_icon.png 3 June, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణాన్ని సైక్లింగ్ తో కాపాడుకోవాలి..

01-06-2025 06:18:56 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ నగరంలో ఈరోజు ఉదయం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మైభారత్ సంస్థ ఆధ్వర్యంలో, ఏజే పెడల్స్ అండ్ ట్రై సిటీ రైడర్స్ అనుసంధానంతో "ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్" కార్యక్రమం భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీని మై భారత్, ఏజే పెడల్స్, ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. హంటర్ రోడ్ నుండి మై భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సమక్షంలో ప్రారంభమైన ఈ ర్యాలీ నగర సర్క్యూట్‌లో సాగింది. 

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సైక్లింగ్ ప్రేమికులు, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు, ఎన్‌ఎస్‌ఎస్ కిట్స్, వరంగల్ విద్యార్థులు, అలాగే ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ నుండి చంద్రశేఖర్, ఏజే పెడల్స్ నుండి జయంత్, అవినాష్, నిఖిల సుమారు 100 మంది సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొని, ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించారు. ఈ ర్యాలీ ప్రధానంగా ప్రజల్లో ఆరోగ్యపరమైన అలవాట్లను పెంపొందించడం, సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం లక్ష్యంగా నిర్వహించబడింది.