14 July, 2026 | 6:31 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

జల వనరులను కాపాడుకోవాలి

23-09-2024 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): జల వనరులను కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలపైనే కాక పౌర సమాజం, స్వచ్ఛం ద సంస్థల పైనా ఉందని ఇన్‌టాక్ జాతీయ పాలకమండలి సభ్యుడు ఎం.వేదకుమార్ అన్నారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, సివిల్ సొసైటీ గ్రూప్స్, ప్రభుత్వ సిటీ కళాశాల, సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ సంయు క్త ఆధ్వర్యంలో శామీర్‌పేట లేక్ కెనాల్ వద్ద నిర్వహించిన కృష్ణా ఉపనది వెంబడి నడక (ఎ వాక్ అలాంగ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ రివర్)కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

శామీర్‌పేట సరస్సు చుట్టూ అంద మైన రాతి నిర్మాణాలు, శాసనాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాన్ని 6వ నిజాం మెహబూబ్ అలీ పాషా, 7వ నిజాం హైదరాబాద్ చుట్టపక్కల ఉత్తమమైన సూర్యాస్తమయ ప్రదేశంగా గుర్తించారని కొనియా డారు. చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ,  శామీర్‌పేట సరస్సు పరిరక్షణ ఉద్యమకారుడు రవీంద్రారెడ్డి, సుభాశ్‌రెడ్డి, నరహరి, శోభాసింగ్, కట్టా ప్రభాకర్ పాల్గొన్నారు.