calender_icon.png 4 August, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంటి కోసం సెల్ టవర్ ఎక్కి నిరసన

04-08-2025 12:08:33 AM

-మహబూబాబాద్ జిల్లా తానంచెర్లలో ఘటన

మహబూబాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు తనకు ఇవ్వలేదని, గ్రామంలో అనర్హులకు ఇచ్చారని, తనకు కూడా మంజూరు చేయాలని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్లలో ఆదివారం జరిగింది.

బాసనపల్లి రాములు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతనికి ఇవ్వకుండా గ్రామంలో అతని కంటే ధనికులైన వారికి ఇచ్చారని ఆరోపించాడు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా తనకు మొండి చేయి చూపారని ఆరోపించాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే తప్ప సెల్ టవర్ నుంచి దిగేది లేదంటూ భీష్మించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి ఇల్లు ఇప్పిస్తామని నచ్చజెప్పి కిందకు దించారు.