18-06-2025 07:08:59 PM
ఘట్ కేసర్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఇంటి నుంచి వెళ్లిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్ కేసర్ పట్టణంలోని కృష్ణమార్ట్ వెనకాల కంచుకం వెంకటేష్, అతని భార్య నందిని(24) ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం సుమారు 1 గంటలకు ముగ్గురు పిల్లలను, ఇల్లు వదిలి నందిని వెళ్లి పోయింది.
దీంతో భర్త వెంకటేష్ మూడురోజుల పాటు బంధుమిత్రుల వద్ద ఆరా తీసిన తన భార్య ఆచూకీ లభించలేదు. కుటుంబ కలహాలు కారణంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటుందని, భర్త వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అదృశ్యమైన మహిళ వివరాలు తెలిసినవారు 8712662705, 8712580183 సంప్రదించి సమాచారం అందించాలని ఎస్ఐ సాయికుమార్(SI Saikumar) తెలిపారు.