calender_icon.png 15 June, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ బిందెలతో నిరసన

14-06-2025 10:46:23 PM

భైంసా (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని నిగువ గ్రామంలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోగా గ్రామంలో చేతిపంపులు బోర్లు ఎండిపోయిన పట్టించుకోవడం లేదని మహిళలు శనివారం ఆందోళన నిర్వహించారు. గ్రామపంచాయతీకి ఖాళీ బిందెలతో తరలివచ్చి నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను నిలదీశారు. నీళ్లు రాకపోవడం వల్ల ప్రతిరోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.