30-05-2025 12:00:00 AM
సింగరేణి వైద్యులకు సీఎండీ బలరామ్ పిలుపు
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నప్పటికీ హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారని, తద్వారా గడిచిన మూడేండ్లలో రూ.30 కోట్లు ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు రూ.100 కోట్లకు చేరాయని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ తెలిపారు. కంపెనీ డాక్టర్లు తమ సమర్థతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతి చిన్న కేసును రిఫర్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
గురువారం సంస్థ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల ప్రధాన వైద్యాధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. ఏరియా ఆసుపత్రుల వైద్యాధికారులు తక్షణమే వారికి కావాల్సిన కనీస వైద్య పరికరాలు, మందుల ప్రతిపాదనలు పంపించాలని, తదుపరి తనిఖీల్లో ఏ ఒక్క పరికరం లేదు అనే మాట రాకూడదని హెచ్చరించారు.
సంస్థకు సంబంధిచిన గోప్యనీయ సమాచారాన్ని ఇవ్వాలని కొందరు వ్యక్తులు కంపెనీ అధికారులు, ఉద్యోగులను బెదిరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలా ఇస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్ (పర్సనరల్) గురువారం విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు.