27 May, 2026 | 9:40 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

పెన్ డ్రైవ్‌లో మార్గదర్శి వివరాలివ్వాలి

08-11-2024 01:23 AM

మార్గదర్శి ఫైనాన్సియర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): మార్గదర్శి ఫైనాన్సియర్స్ చందా వసూళ్లు చట్టబద్ధమో? కాదో? తేల్చుతామని హైకోర్టు స్పష్టం చేసింది. వసూలు చేసిన చందాలు చందాదారులకు ఇచ్చారో లేదో కూడా తేల్చుతామని పేర్కొన్నది. సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిన వివరాలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వద్ద ఫిజికల్ కాపీలున్నప్పుడు ఎలక్ట్రానిక్ కాపీ ఇచ్చేందుకు ఆ సంస్థకు ఉన్న సమస్య ఏమిటో చెప్పాలని అడిగింది.

పెన్‌డ్రైవ్‌లో వివరాలు ఇస్తే అవకతవకలు, అక్రమాలు నిరూపిస్తానని ఉండవల్లి చెప్తున్నందున ఆ వివరాలన్నీ ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. గతంలో ఆదేశించిన మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎందుకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.

డిసెంబర్ 20లోగా కౌంటర్లు వేయాలని రెండు రాష్ట్రాలతోపాటు ఆర్బీఐలకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.