15-06-2025 12:24:02 AM
మాజీమంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఏపీ, మన రాష్ట్రానికి చెందిన జలాలను దోపిడీ చేస్తున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. హైదరా బాద్లోని తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టుల్లో జరుగుతున్న నష్టాల మీద కేంద్రప్రభుత్వం స్పందించదని, ఎలాంటి కమిషన్లు వేయదని అన్నా రు.
శ్రీశైలం సొరంగం కూలినా, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా, వట్టెం పంప్హౌస్ మునిగినా, కేం ద్రం ఎందుకు కమిషన్లు పంపడం లే దని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. దేశం లో కాంగ్రెస్, బీజేపీలు బద్ధ శత్రువులైనా, రాష్ర్టంలో కలిసే ప్రయాణం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం మీద చూపిన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న బీజేపీ, మిగతా వాటి మీద ఎందుకు చూపదన్నారు. శ్రీశై లం సొరంగం పనుల విషయంలో ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.