19 March, 2026 | 1:08 AM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

29-07-2025 12:22 AM

ఎంపీడీవో రాధా రాణి 

యాచారం జులై 28 : గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో రాధారాణి సూచించారు. సోమవారం యాచారంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆమె సందర్శించారు.

తరగతి గదులు, మధ్యాహ్న భోజనం అవి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆమె ఉపాధ్యాయులనుసూచించారు.