24 March, 2026 | 8:18 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

గురుకుల విద్యార్థులపై మానసిక ఒత్తిడి

27-08-2024 01:33 AM

పాఠశాలల పనివేళలు మానసిక వికాసానికి తగినట్టు ఉండాలి

ఇండియన్ సైకియాట్రిస్ట్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): గురుకుల విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఉందని, పౌష్టికాహార, శారీరక వ్యాయామ లోపం, వివిధ మానసిక రుగ్మతలకు దారితీసి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని ఇండియన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు. గురుకుల పాఠశాలల పనివేళలు విద్యార్థుల మానసిక వికాసానికి తగిన విధం గా ఉండాలని, ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా పని చేసేట్టు సమయాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గురుకులాల పనివే ళలుP విద్యార్థులపై ప్రభావం అనే అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబు ల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గురుకుల పాఠశాలల పనివేళలు శాస్త్రీయంగా నిర్ణయించాలని వక్తలు డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శిలు కే జంగయ్య, చావ రవి, కోశాధికారి టీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.