సుల్తానాబాద్ 15వ వార్డులో ప్రజా పాలన
31-03-2026 07:02 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో ప్రజాపాలన ... ప్రగతి ప్రణాళిక (99) రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మంగళవారం 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ఆ కాలనీ వార్డు కౌన్సిలర్ గాదాసు మంజుల రవీందర్ లు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మురికి కాల్వల ను శుభ్రం చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత , పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




