calender_icon.png 24 June, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

24-06-2025 12:11:25 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 23 (విజయక్రాంతి) : ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి  అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను కమిటీ శాఖల వారిగ  పరీశిలించి పరిష్కరించాలన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఆడిటింగ్ అధికార్లతో కలిసి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులలో భూ సమస్యల పై 34, ఇరిగేషన్ 6, మున్సిపాలిటీ 2, డి పి ఓ 4, డి డబ్ల్యు ఓ 4 ఇతర శాఖలకు  సంబందించినవి 49 మొత్తం 99 మొత్తం   ధరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబందిత అధికారులకి పంపించటం జరుగుతుందని తెలిపారు. 

డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డి పి ఓ యాదగిరి, ఆడిటింగ్ అధికారి శ్యామ్ సుందర్, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డి డబ్ల్యూ ఓ నరసింహారావు,డి ఈ ఓ అశోక్, సి పి ఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.