ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
సూర్యాపేట, మార్చి 2 (విజయక్రాంతి) : ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్ లో ఉన్న పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలన్నారు.
అలాగే రాష్ట్ర స్థాయి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 25 దరఖాస్తులు,జిల్లా పంచాయతీ అధికారి 7, డి డబ్ల్యు ఓ 7, వైద్య ఆరోగ్య శాఖ అధికారి 6, మిగిలిన 38 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 83 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఇన్చార్జి సీఈఓ శిరీష, ఆర్డీవో వేణుమాధవ్ రావు, డిఏఓ శ్రీధర్ రెడ్డి, సిపిఓ కిషన్, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి సీతారాం నాయక్, డిఇఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, కే. దయానంద రాణి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.




