20-05-2025 01:18:55 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మే 19(విజయక్రాంతి): ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్ లోని ప్రజావాణి సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కా ర్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్ పి. సి. ఈ. ఓ. ఎం. వి. శైలేష్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.