calender_icon.png 28 June, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య

28-06-2025 01:28:20 AM

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే.. హామీలను నెరవేరుస్తున్నాం

- దివ్యాంగులకు ప్రభుత్వం వెన్నుదన్ను

-ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

మహబూబాబాద్, జూన్ 27 (విజయక్రాంతి)/ మహదేవ్‌పూర్: బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే.. ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యాసం స్థలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని, దివ్యాంగులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని మంత్రి తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్, కాటారం మండలాల్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. మహాదేవ్‌పూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిల్డ్రన్స్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. మనోహర్ మండలం కిషన్‌రావు పల్లి నుంచి భూపాలపల్లి 1 ఇంక్లైన్ వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 89 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఆ లింకో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 54 మంది దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. కాటారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.

ఇచ్చిన హామీల్లో నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్య, సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కోటీశ్వ రులుగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు.

ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరా మిరెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ శాఖ అధికారులు మల్లీశ్వరి, రాధిక, సొసైటీ చైర్మన్ చల్లా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.