calender_icon.png 28 June, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కతాలో దారుణం

28-06-2025 01:32:42 AM

లా విద్యార్థిని గ్యాంగ్‌రేప్

-కస్బా లా కాలేజీ క్యాంపస్‌లో ఘటన

-తృణమూల్ కార్యకర్త సహా ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

-కాళ్లుమొక్కినా కనికరించలేదని బాధితురాలి ఆవేదన

-జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

-రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు

కోల్‌కతా, జూన్ 27: పశ్చిమబెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. దక్షిణ కలకత్తాలోని కస్బా ప్రాంతంలోని లా కాలేజీలో విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలోనే సాముహిక అత్యాచారం జరగడం సంచలనం కలిగించింది.

ఆరు నెలల క్రితం ఇదే రాష్ట్రం లో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచార ఘటన మరువక ముందే మరోసారి అదే తరహ సంఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. పోలీసుల వివరాల ప్రకా రం.. జూన్ 25వ తేదీ రాత్రి 7.30 గంటల మధ్య కస్బా లా కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  దీనిపై బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

అత్యాచారానికి సంబంధించిన వీడియోలను మొబైల్ ఫోన్లలో బం ధించారని.. ఎవరికైనా చెబితే వీడియోలు లీక్ చేస్తామని బెదిరించినట్టు బాధితురాలు పోలీసుల వద్ద వాపోయింది. దీంతో పోలీసులు గురువారం జయిబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ్ (20) అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులతో పాటు అదే కాలేజీలో చదువుకున్న మాజీ విద్యార్థి, ప్రస్తుత టీఎంసీ కార్యకర్త మనోజిత్ మిశ్రా (31)ను అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసులో మనోజిత్ మిశ్రాను కీలక నిందితుడిగా పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చిత్తరంజన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని అలిపోర్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజి స్ట్రేట్ ముందు హాజరుపరచగా.. వచ్చే మంగళవారం వరకు వారిని కోర్టు రిమాండ్‌కు పంపింది.

విద్యార్థిని పెళ్లికి అంగీకరి ంచకపోవడంతోనే ఈ దురాఘతానికి పా ల్పడినట్టు తెలుస్తోంది. కాగా విద్యార్థినిపై గ్యా ంగ్ రేప్ కు పాల్పడడంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కోల్‌క తా పోలీస్ కమిషనర్‌కు జాతీయ మహిళా క మిషన్ చైర్మన్ విజయ్ రహత్‌కార్  లేఖ రాశారు. బాధితురాలిపై అత్యాచారం జరగడం ఆందోళనకరమని.. రాష్ట్రంలో మ హిళలకు భద్రత కరువయ్యిందని పేర్కొన్నా రు.

ఘటనపై మూడు రోజుల్లోగా పూర్తి నివేదికను తమకు అందించాలని కోల్‌కతా పో లీసులను ఆదేశించారు. బాధితురాలికి నష్ట పరిహారంతో పాటు వైద్య చికిత్సలకు స ంబంధించి చట్టపరమైన సహాయం అందించాలని పేర్కొన్నారు. తక్షణమే విచారణను ప్రారంభించాలని జాతీయ మహిళా కమిష న్ పే ర్కొంది. అయితే ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. నిరసనల వెల్లువ..

లా కాలేజీ విద్యార్థినిపై జరిపిన సాముహిక అత్యాచారంపై పశ్చిమబెంగాల్ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వరుస అత్యాచార ఘటనలతో రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయిందంటూ ప్రజలు పెద్ద ఎత్తున ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ.. ‘ లా విద్యార్థినిపై కాలేజీ ఆవరణలోనే సాముహిక అత్యాచారం జరగడం దారుణం. నిందితుల్లో పూర్వ విద్యార్థితో పాటు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.

అయితే పూర్వ విద్యార్థి తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అని తెలుస్తోంది. ఆర్టీకర్ మెడికల్ కాలేజీ ఘటన మరువక ముందే మరో ఘటన జరగడం దురదృష్టకరం. మమతా బెనర్జీ పాలనలో ఇక్కడి మహిళలకు భద్రత లేకుండా పోయింది. నిందితులకు శిక్ష పడే వరకు ఊరుకోం’ అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు జరుగుతుంటే మమతా ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతాకు సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదని.. దీనిపై సీరియస్ విచారణ అవసరమని పేర్కొన్నారు.

నిందితుడికి పార్టీతో సంబంధం లేదు: తృణముల్

లా విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో నిందితుడిగా పేర్కొన్న ఆ కాలేజీ పూర్వ విద్యార్థి మనోజిత్ మిశ్రా తృణముల్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మనోజిత్ ప్రస్తుతం దక్షిణ కోల్‌కతా జిల్లాకు  తృణముల్ కాంగ్రెస్ చాత్రా పరిషత్ (టీఎంసీపీ) జనరల్ సెక్రటరీగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ ఆరోపణలను తృణముల్ కాంగ్రెస్ తోసిపుచ్చింది. విద్యార్థిని అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న మనోజిత్‌కు తమ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని తృణముల్ పేర్కొంది. ఇదే విషయాన్ని తృణముల్ చాత్రా పరిషత్ అధ్యక్షుడు భట్టాచార్య కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం దక్షిణ కోల్‌కతా జిల్లాకు పార్టీ నుంచి స్టూడెంట్ లీడర్ ఎవరు లేరని.. అయినా మనోజిత్ అనే పేరుతో తమ స్టూడెంట్ వింగ్‌లో ఎలాంటి పోస్టు ఇవ్వలేదన్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులతో కలిసి మనోజిత్ దిగిన ఫోటోలను బీజేపీ పార్టీ విడుదల చేసింది. 

తృణముల్ నేతలతో సత్సంబంధాలు

లా విద్యార్థిని అత్యాచారం కేసు లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోజిత్ మిశ్రాకు తృణముల్ కాంగ్రెస్‌తో సత్ససంబంధాలు ఉన్నట్టు తాజాగా విడుదల యిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ కోల్‌కతా జిల్లాకు తృణముల్ కాంగ్రెస్ చాత్రా పరిషత్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న మనోజిత్  ఆ పార్టీ నిర్వహించిన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు తేలింది.

గతంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో మనోజిత్ ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, మంత్రి చంద్రిమా భట్టాచార్య సహా టీఎంసీ కౌన్సిలర్ కజరి బెనర్జీతో ఫోటోలు దిగారు. అయితే తృణముల్ కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ మనోజిత్ మిశ్రా తమ పార్టీలో కొనసాగడం లేదని చెప్పడం కొసమెరుపు. తాజాగా బీజేపీ మనోజిత్ తృణముల్ మంత్రులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను విడుదల చేయడంతో రాజకీయ దుమారం చెలరేగుతుంది.